Header Banner

రైతులకు తీపి కబురు! అన్నదాత సుఖీభవ పై కీలక ప్రకటన! మీ అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే!

  Mon May 05, 2025 13:15        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం అన్నదాత సుఖీభవ కోసం ఎదురుచూస్తుంది. ఇక ఇదే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా రైతులకు శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యవర్గంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కీలక విషయాలను వెల్లడించారు.


పార్టీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు

జూన్ 12 కి కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుందని ఇప్పటివరకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏ మంచి చేసిన ఓర్చుకోలేని వైసిపి నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.


ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్నదాత సుఖీభవ అమలుకు ముహూర్తం ఫిక్స్

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసిన చంద్రబాబు ఇంకా ఎంతో కాలం నిరీక్షించాల్సిన అవసరం లేదని తాజా ప్రకటనతో స్పష్టం చేశారు. గతంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాలో 20000 జమ చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఇచ్చిన మాట ప్రకారం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు.


మహానాడుపై చంద్రబాబు ఏమన్నారంటే

పార్టీ కార్యవర్గంతో మాట్లాడిన చంద్రబాబు ఇక ఇదే విషయాన్ని వెల్లడించారు. కడపలో 27, 28, 29తేదీలలో మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈనెల 18వ తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగతా అన్ని కమిటీలను వేయాలని చంద్రబాబు సూచించారు. ఇక మహానాడు తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీలను వేయనున్నట్టు గుజరాత్ మోడల్ రాష్ట్రంలోనూ అమలవ్వాలని, సుస్థిర ప్రభుత్వం ఉండడంతో గుజరాత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.



ఇది కూడా చదవండి: జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

తల్లికి వందనంపై చంద్రబాబు ప్రకటన

ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా, పార్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నామని, సంవత్సరం పాలనలో స్పష్టమైన మార్పు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించామన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలులో తమ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు పాఠశాలల ప్రారంభానికి ముందే 15 వేల రూపాయలు చొప్పున అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు.


ప్రజల్లోకి ఈ విషయాలు తీసుకెళ్ళండి.. చంద్రబాబు ఆదేశం

2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా పని చేయనున్నామని, పోలవరానికి నిధులు రాబట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటవ తేదీన పింఛన్లు అందజేస్తున్నామని, దీపం 2 కింద కోటి మందికి పైగా లబ్ధిదారులకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని వీటన్నింటినీ ప్రజలలోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పైన తీపి కబురు చెప్పి ఈ నెలలో ప్రారంభిస్తామన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AnnadataSukhibhava #ChandrababuNaidu #APFarmers #AndhraPradesh #TDPGovernment #NDAinAP